యేసు బోధల ప్రకారం మనం జీవించలేకపోవడానికి కారణం ఆయన చెప్పేవి మనకి అర్ధం కాకపోవడం. అర్ధం కాకపోవడానికి కారణం ఏంటంటే ఆయన చెప్పే వాటికి పూర్తి భిన్నంగా మన ఆలోచనలు, మన జీవితము ఉంటుంది.
అందుకే ఒక పట్టాన మనకి అర్ధం కావు, ఒకవేళ అర్ధమైనా, వాటిని అనుసరించలేము.
ఇంతపెద్ద ప్రపంచంలో, ఎన్నో రంగులు, హంగులూ, ఆర్భాటాలు, స్నేహాలు,
బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఈ లోకాన్నుండి మనల్ని విడదేయలేని
ఇంకా ఎన్నిటినో కాదని 'అవసరమైనది ఒక్కటే' అని చెప్పగానే 'ఓకే' చెప్పడానికి
మనమేమన్నా పిచ్చోళ్ళమా? ఇలాంటి ఆచరణ సాధ్యం కాని బోధ చేస్తున్నాడనే
కదా ఆయన ఏర్పరచుకున్న పన్నెండు మంది శిష్యులు కాకుండా ఆయనను
వెంబడించే శిష్యులలో కొంతమంది ఆయనను వదిలేసి పారిపోయి మళ్ళీ ఆయన
దగ్గరకు రాలేదు. 'అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, మరి
ఎన్నడును ఆయనను వెంబడింపలేదు' (యోహాను 6:66). అప్పుడు యేసు తన
శిష్యులను కూడా అడిగాడు 'మీరు కూడా వెళ్ళిపోవలెనని యున్నారా?” అని. ఇదే
ప్రశ్న దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు 'నేను చెప్పేది ఆచరించలేక మీరు
కూడా వెళ్ళిపోతారా?” అని. బాగా ఆలోచించి సమాధానం చెప్పాల్సింది మనమే.
'అవసరమైనది ఒక్కటే, అదే దేవుని సన్నిధి' మరియ ఎంచుకున్న 'ఉత్తమమైనది'
'యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన
105:4).
వెదకటమంటే మనం చేయాల్సిన పనులన్నీ మానేసి ఏ చర్చీలోనో, ఇంట్లో ఒక మూల కూర్చొని బైబిలు చదువుతూనో, ప్రార్ధన చేసుకుంటూ ఉండటమో కాదు
గానీ, మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా మన హృదయములో, మన
ఆలోచనలలో దేవుని గూర్చి తలపోసుకుంటూ ఉండటమే. 'కాబట్టి మీరు ఈ నా
మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని... నీవు నీ యింట
కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనునప్పుడు, లేచునప్పుడు
వాటిని గూర్చి మాటలాడుచు... (ద్వితీయో. 11:18, 19). ఇలా చేయడమే మనం
దేవుని సన్నిధిలో నిత్యము ఉండటం. 'అవసరమైనది ఒక్కటే' అని యేసు చెప్పింది
కూడా అదే. మరి దేవుని సన్నిధిని నిత్యము వెదకటానికి నీవు సిద్ధమా?
ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలము మేము ఈ లోకానుసారంగా
జీవించకుండా నిత్యము నీ సన్నిధిని వెదకునట్లు మాకు సహాయం దయచేయుమని
యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.
No comments:
Post a Comment